మీడియాపై దాడి.. ప్రజాస్వామ్యంపై దాడే: బొత్స | Botsa Reacts On Sakshi Office Attacks kommineni Arrest | Sakshi
Sakshi News home page

మీడియాపై దాడి.. ప్రజాస్వామ్యంపై దాడే: బొత్స

Jun 10 2025 9:10 PM | Updated on Jun 10 2025 9:27 PM

Botsa Reacts On Sakshi Office Attacks kommineni Arrest

సాక్షి, విశాఖపట్నం: అక్రమ కేసులో సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్‌ చేయడం, సాక్షి మీడియా సంస్థ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను శాసన మండలిలో విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా దెబ్బతింది. మూడు రోజులుగా ఓ పథకం ప్రకారమే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. ఏలూరు సాక్షి కార్యాలయానికి నిప్పుపెట్టడం దుర్మార్గం. మీడియాపై దాడి చేశారంటే.. ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లే. ఈ హింసాత్మక చర్యలు భవిష్యత్‌లో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి అని బొత్స ఓ ప్రకటనలో అన్నారు. 

దాడులతో ప్రశ్నించే వారిని భయపెట్టలేరని, ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, జరిగిన దారుణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement