వరి సాగు విధానంలో ఆధునిక సాంకేతిక వినియోగంపై అవగాహన కల్పించారు. రసాయనాలు, నీటి వినియోగం తగ్గించి ఆర్థికభారం పడకుండా చూడడమేకాకండా అధిక దిగుబడి సాధించడం సంతోషాన్నిచ్చింది.
– ఎర్రం కవిత, ఐతరాజ్పల్లి
నీటి పొదుపుతో అధిక దిగుబడి
రైతు పొలం మడిలో మా ప్రతినిధులు పైపు అమర్చారు. దాని అడుగున నీరు ఉండేలా చూసిన రైతు అధిక దిగుబడి సాధించి ఎకరాకు రూ.500 ప్రోత్సాహకం అందుకున్నారు. ఇది కాలుష్య కారకాలనూ తగ్గించింది.
– మురళీధర్, సీఈవో, సీ అండ్ రీప్


