పిల్లలు సరిపడా నీరు తాగకుంటే రక్తం చిక్కపడుతుంది. తద్వారా తలనొప్పి, అలసట, కడుపునొప్పి, మూత్రం రంగు మారడం వంటి సమస్యల బారిన పడుతారు. ఏకాగ్రత తగ్గి ఎప్పుడూ నిరుత్సాహంగా ఉంటారు. వేసవిలో చెమట రూపంలో శరీరంలోని నీరు మొత్తం బయటకు వెళ్లిపోవడంతో సమస్య మరింత జఠిలమై డీ హైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. ప్రతీగంటకు నీరు తాగేలా పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. తగినంత నీరు తీసుకోవడం, విసర్జించడం ముఖ్యమనే అవగాహన విద్యార్థుల్లో పెంచాలి.
– శ్రీధర్, డీసీహెచ్వో, పెద్దపల్లి


