రామగిరి(మంథని): సెంటినరీకాలనీ పోస్టాఫీసులో పోస్టల్ అధికారులు బుధవారం విచారణ జరిపా రు. బేగంపేట, సెంటినరీకాలనీ పోస్టాఫీసుల్లో డి పాజిట్లు, ప్రతీనెల పొదుపు డబ్బులు, కిసాన్ వికాస్ పత్రం(కేవీపీ), సుకన్య పథకం డబ్బులు జమకాలేదని, ఈ నిధులు స్వాహా చేశారని గతంలో ఆరోప ణలు వెల్లువెత్తిన విషయం విదితమే. ఈ రెండు త పాలా కార్యాలయాల్లో దాదాపు రూ.కోటి వరకు అ వినీతి జరిగిన నేపథ్యంలో అధికారులు కొద్దిరోజు లుగా విచారణ జరుపుతున్నారు. గోదావరిఖని, జ మ్మికుంట పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్రెడ్డి, మోహన్ విచారణ జరిపారు. 15 నెలలుగా డబ్బులు అందక బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.


