పేదలకు ఇళ్లు కట్టిస్తాం | - | Sakshi
Sakshi News home page

పేదలకు ఇళ్లు కట్టిస్తాం

Aug 20 2025 5:13 AM | Updated on Aug 20 2025 5:13 AM

పేదలకు ఇళ్లు కట్టిస్తాం

పేదలకు ఇళ్లు కట్టిస్తాం

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మారం(ధర్మపురి): స్థోమతలేని పేదలకు తానే ద గ్గరుండి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ అభయం ఇచ్చారు. స్థానిక మండల పరిష త్‌ కార్యాలయంలో మంగళవారం 23 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.23,26,006తోపాటు 121 మందికి సీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించి రూ. 41,63,500 విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేసి మాట్లాడారు. అర్హులైనవారందరికీ దశలవారీ గా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రా జకీయ జన్మనిచ్చిన ధర్మారం మండలంలోని ప్రతీపేదకు ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఒక్క రేషన్‌కార్డు కూడా అందించలే దని ఆరోపించారు. నాయకులు లావుడ్య రూప్లానాయక్‌, అరిగే లింగయ్య, కొడారి అంజయ్య, కొత్త న ర్సింహులు, తిరుపతిరెడ్డి, అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement