
జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక
వేములవాడ: సివిల్ జడ్జి(జూనియర్ బెంచ్) పరీక్షల్లో వేములవాడకు చెందిన సంకెపల్లి జాహ్న వి అర్హత సా ధించారు. పట్టణంలోని భీమేశ్వరాలయం వీధికి చెందిన ఎస్.హరికిషన్ కూతురు జాహ్నవి ఉస్మానియా యూనివర్సిటీలో బీకాం ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ప్రస్తుతం న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నా రు. నాలుగో ప్రయత్నంలో జడ్జిగా అర్హత సాధించారు.
8లోగా దరఖాస్తు చేయాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని మున్సిపాలిటీల రికార్డులను ఆడిట్ చేసేందుకు ఆసక్తిగల ఆడిటర్లు ఈనెల 8లోగా దరఖాస్తు చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ తెలిపారు. జిల్లాలోని రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఏరియా లెవెల్ ఫెడరేషన్, టౌన్ లెవల్ ఫెడరేషన్కు సంబంధించిన రికార్డులను ఆడిట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత, అనుభవం గల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆడిటర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. దరఖాస్తులను మెప్మా కార్యాలయంలో ఈనెల 8లోగా అందించాలన్నారు. వివరాలకు 63048 94940 నంబరులో సంప్రదించాలని అదనపు కలెక్టర సూచించారు.
పుట్టెడు దుఃఖంలోనూ ఉత్తమ ఫలితం
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బోనగిరి శశివర్ధన్ పదో తరగతి పరీక్షలు రాస్తున్న సమయంలో తన చిన్నబాపు బోనగిరి లక్ష్మీరాజం గుండెపోటుతో మృతిచెందాడు. పుట్టెడు దుఃఖంలోనూ తరగతి పరీక్షలు రాసిన శశివర్ధన్ బుధవారం వెలువడిన ఫలితాల్లో ఉత్తమ 521 మార్కులు సాధించాడు. రుద్రంగి జెడ్పీ హైస్కూల్ టాపర్గా నిలిచాడు. విద్యార్థి శశివర్ధన్ను జెడ్పీ హైస్కూల్ అధ్యాపకబృందం, ప్రజా ప్రతినిధులు అభినందించారు.

జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక

జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక