మద్యం దుకాణాలపై కేసు | - | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాలపై కేసు

Nov 14 2023 12:30 AM | Updated on Nov 14 2023 12:30 AM

 కేసు నమోదు చేస్తున్న సీఐ రమేశ్‌
 - Sakshi

కేసు నమోదు చేస్తున్న సీఐ రమేశ్‌

గోదావరిఖని: ఎన్నికల కమిషన్‌కు సకాలంలో సేల్స్‌ వివరాలందించని రెండు మద్యం దుకాణాలపై కేసు నమోదు చేసినట్లు రామగుండం ఎకై ్సజ్‌ సీఐ సుంకరి రమేశ్‌ తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు ప్రతిరోజు రాత్రి 11 గంటల్లోపు ఆయా బ్రాందీషాపుల సేల్స్‌ వివరాలు పెట్టాలని అన్ని షాపులకు చెప్పినా.. యజమానులు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్టాక్‌ రిజిస్టర్లు అందుబాటులో లేని యైటింక్లయిన్‌కాలనీకి చెందిన తెలంగాణ వైన్స్‌, గోదావరిఖని మార్కెట్‌ వద్ద గల దుర్గావైన్స్‌పై నాన్‌ మెయింటెనెన్స్‌ ఆఫ్‌ అకౌంట్‌ రిజిస్టర్‌ కేసు నమోదు చేసి రూ.15 వేల చొప్పున జరిమానా విధించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement