మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి ఆలయంలోని హుండీలలో భక్తులు సమర్పించుకున్న కానుకలను దేవదాయశాఖ, బొబ్బిలి తనిఖీదారు ఎన్.రాజకుమారి, ఈవో వీవీ సూర్యనారాయణ, ట్రస్ట్బోర్డు చైర్మన్ ఎన్.తిరుపతిరావు, కమిటీసభ్యులు, గ్రామపెద్దల సమక్షంలో శుక్రవారం లెక్కించారు. ఈఏడాది మార్చి26 నుంచి ఆగస్టు 6వతేదీ వరకు వనంగుడి, చదురుగుడిలో మొత్తం రూ.8,90,817 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో మాజీచైర్మన్లు, ధర్మకర్తలు, కురుపాం మండలం శ్రీవారిసేవకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


