
–8లో
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
బంగారు కొండలు
దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్స్ భారత్–2025 పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు రాణించారు. పతకాల పంట పండించారు.
సాగుకు కూలీల కొరత
వ్యవసాయ రంగాన్ని రోజురోజుకూ కూలీల కొరత వేధిస్తోంది. ఓ వైపు పెట్టుబడుల భారం, మరోవైపు కూలీలు దొరకకపోవడం
రైతన్నకు సమస్యలుగా మారాయి.
జూనియర్ సివిల్ జడ్జిలకు బదిలీ
విజయనగరం లీగల్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలువురు జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎల్.దేవిరత్నకుమారిని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి బదిలీచేయగా, ఆమె స్థానంలో మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి (ఎకై ్సజ్ కోర్టు) ఎం.శ్రీనివాసరావును నియమించింది. విజయనగరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.రమ్య శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కోర్టుకు బదిలీకాగా ఆమె స్థానంలో టెక్కలిలో పనిచేస్తున్న తేజచక్రవర్తి నియామకమయ్యారు. గజపతినగరంలో పనిచేస్తున్న బి.కనకలక్ష్మి ఎస్.కోటకు బదిలీకాగా ఆమె స్థానంలో పాలకొండలో పనిచేస్తున్న విజయ్రాజ్ కుమార్ను, సాలూరులో పనిచేస్తున్న కె.రమేష్కు విశాఖ జిల్లా ఎలమంచిలికి బదిలీ చేయగా, ఆయన స్థానంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పనిచేస్తున్న జి. హర్షవర్దన్ను నియమించింది. శ్రీకాకుళం జిల్లా అదనపు జూనియర్ సివిల్ జడ్జి (ఎకై ్సజ్ కోర్టు) శ్రీవిద్యను విజయనగరం మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి (ఎకై ్సజ్ కోర్ట్)కు, చీపురుపల్లిలో పనిచేస్తున్న వై.ప్రేమలతకు విశాఖపట్నం బదిలీ అయింది. ఎస్.కోటలో పనిచేస్తున్న ఎస్ వాణికి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు బదిలీ అయ్యింది. కొంతకాలంగా ఖాళీగా బొబ్బిలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా కడపలో పనిచేస్తున్న హేమ స్రవంతి జానకీరామ్ను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు అయిన వారు వచ్చేనెల 2వతేదీలోగా వారివారి స్థానాల్లో చేరాలని ఉత్తర్వులలో పేర్కొంది.
30న పాలిసెట్
విజయనగరం అర్బన్: పాలిసెట్ ప్రవేశపరీక్ష ఈ నెల 30న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. పాలిసెట్ నిర్వహణపై తన చాంబర్లో అధికారులతో మంగళవారం సమీక్షించారు. జిల్లాలో 8,083 మంది అభ్యర్థులు 23 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నట్టు వెల్లడించారు. వీరికోసం విజయనగరంలో 9, బొబ్బిలిలో 6, గజపతినగరంలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు.
సలహా మండలి ఉంటే..
రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ఆర్టికల్ 244(1) ప్రకారం ఏజెన్సీ ప్రాంతాలున్న ప్రతి రాష్ట్రంలోనూ గిరిజన సలహా మండలిని విధిగా ఏర్పాటు చేయాల్సి ఉంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సలహా మండలి ఏర్పాటైతే.. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమంపై అందులో తగు నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. గతంలో జిల్లాకు సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీవాణి, పీడిక రాజన్నదొర, అప్పటి ఎమ్మెల్సీ హోదాలో ప్రస్తుత మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, నిమ్మక జయరాజు, జనార్దన్ థాట్రాజ్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉండేవారు. కీలక అంశాలకు సంబంధించి చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోయింది.
● అడవిలో ఎలాంటి ఖనిజాన్ని తవ్వాలన్నా గిరిజన సలహా మండలి తీర్మానం తప్పనిసరి.
● గిరిజనులకు అవసరమైన అనేక విషయాలపై సలహా మండలిలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చర్చించి, అమలు చేయవచ్చు.
● ప్రస్తుతం ఆంధ్రా–ఒడిశా కొటియా వివాదాస్పద గ్రామాల సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ గనుల తవ్వకాల కోసం ఒడిశా ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఈ సమయంలో దీనిపై అధికార పక్షం నుంచి గిరిజనుల తరఫున మాట్లాడే వారు కరువయ్యారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర వంటివారు పోరాటం చేస్తున్నా.. అధికార పక్షం నుంచి సహకారం కొరవడుతోంది.
● పార్వతీపురం, సీతంపేటలాంటి ఐటీడీఏలకు రెగ్యులర్ పీవోలు లేరు. గిరి పుత్రులకు సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఇటువంటి సమయంలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన కీలకమైన సలహా మండలి కూడా లేకపోవడం గిరి పుత్రులను నిర్లక్ష్యం చేయడమే.
● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గిరిజన సలహా మండలి సమావేశంలో రాష్ట్రంలోని 554 గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాలుగా గుర్తించాలని తీర్మానం చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి 14 మండలాల్లో 182 గ్రామాలున్నాయి. ఆ తీర్మానం నేటికీ కేంద్రానికి చేరలేదు. కొత్తగా ఏర్పాటయ్యే గిరిజన సలహా మండలి దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.
● ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏళ్ల తరబడి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న వారి పోస్టులనూ కలిపేసింది. దీనివల్ల వందలాది మంది సీఆర్టీలకు, అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. వారి పోస్టులను మినహాయించి, మెగా డీఎస్సీ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు.
● గిరి ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోని కూటమి ప్రభుత్వం
● కానరాని గిరిజన సలహా మండలి సమావేశాలు
● నిధులు లేక నీరసించిపోతున్న ఐటీడీఏలు
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఏజెన్సీ ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గిరిజన శాఖ మంత్రిగా జిల్లాకు సంబంధించిన సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణి వ్యవహరిస్తున్నప్పటికీ.. ఈ ప్రాంతంలోని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలకు మోక్షం కలగడం లేదు. ఫలితంగా అడవి పుత్రుల ఆవేదన.. అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. కనీస మౌలిక సదుపాయాలు లేక గిరిజన గూడలు తల్లడిల్లుతున్నాయి.
అడవి బిడ్డల సంక్షేమంలో కీలక భూమిక పోషించే గిరిజన సలహా మండలి ఏర్పాటుపై 11 నెలలవుతున్నా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. నిధులులేక ఐటీడీఏలు నీరసించిపోతున్నాయి. అభివృద్ధిపనులు తలపెట్టేందుకు వెనుకంజవేస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకంపై మంత్రి ఇచ్చిన హామీ ఎండమావిగానే మిగిలింది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కొరవడింది. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆస్పత్రులకు పరుగుతీయాల్సిన దుస్థితి నెలకుంది.
పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం
న్యూస్రీల్
గిరిజన సలహా మండలి ఏర్పాటుతోనే సమస్యలకు పరిష్కారం
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. గిరిజన భూరక్షణ చట్టం 1/70పై అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలు నేపథ్యంలో గిరిజన సలహా మండలిలో చట్టం పక్కాగా అమలు చేస్తామని తీర్మానం చేయాలి. అటవీ సంపద రక్షణ, జీవో నంబర్ 3 స్థానాల్లో అదే తరహా మరో జీవో కోసం తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదం తెలిపి, కొత్తగా జీవో తెచ్చి, గిరిజన డీఎస్సీ నిర్వహణ చేయడానికి చర్యలు తీసుకోవాలి.
– పాలక రంజిత్కుమార్, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి

–8లో

–8లో

–8లో