ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

Apr 20 2025 2:38 AM | Updated on Apr 20 2025 2:38 AM

ఆదివా

ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్‌: కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది. ఈ కాలంలో జిల్లా ప్రజలకు ఏమన్నా మంచి పనులు చేశారా అంటే.. వేళ్లు తీసి లెక్క పెట్టడానికి ఆలోచించాలి. ఇదే సమయంలో దోచుకోవడం.. దాచుకోవడం.. పంచుకోవడం.. వర్గవిభేదాలతో రచ్చకెక్కడం.. రోజుకొక చోట విభేదాలతో వీధిన పడటం.. తమ అక్రమాల దారికి అడ్డొచ్చేవారిని అదిలించడం.. ఇదే ‘తమ్ముళ్లు’ పనిగా పెట్టుకున్నారు. అసలే మూడు పార్టీలతో ముచ్చటగా ఏర్పడిన కూటమి.. వారిలో వారికే సఖ్యత లేమి. మూణ్నాళ్లు కూడా కలిసి ఉండలేక.. సతమతమై ‘పంపకాల’లో తేడాతో బజారున పడుతుండడం చర్చనీయాంశంగా మారింది.

పాలకొండలో నామినేటెడ్‌ పోస్టుల లొల్లి..

పాలకొండ నియోజకవర్గంలో కూటమి మధ్య ఉన్న వర్గపోరు.. ఇన్‌చార్జి పడాల భూదేవిపై ఉన్న అసంతృప్తి మరోసారి బహిర్గతమైంది. తక్షణమే ఆమెను ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించాలని నాలుగు మండలాల తెలుగు తమ్ముళ్లు.. టీడీపీ పరిశీలకుల వద్దే ఏకరవు పెట్టారు. ఏకంగా వీధికెక్కారు. శనివారం జరిగిన పాలకొండ నియోజకవర్గ సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమం దీనికి వేదికై ంది. వాస్తవానికి నియోజకవర్గంలో గత ఎన్నికలకు ముందు నుంచే కూటమిలో రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అనేలా ఉన్నాయి. జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ (తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కళా వర్గం), టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి (మంత్రి అచ్చెన్న వర్గం)ల మధ్య విభేదాలు నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే వస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి నామినేటెడ్‌, పార్టీ పదవుల కేటాయింపుల భర్తీ మరింత చిచ్చు రేపింది. ఇటీవల మార్కెట్‌ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, డైరెక్టర్‌ పదవుల కేటాయింపుల్లో పట్టు సాధించే క్రమంలో ఎమ్మెల్యే జయకృష్ణ.. తమ వర్గానికి చెందిన వారికి పదవులు కట్టబెట్టేందుకు పావులు కదిపారు. జనసేన కండువాలు కప్పి తనకు నచ్చినవారికి పదవులు కేటాయిస్తున్నట్లు ఓ వర్గం ఆరోపణలు చేస్తోంది. మరోవైపు పట్టు కోసం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో సంప్రదించి భూదేవి వర్గం ఎమ్మెల్యే ప్రస్తావన లేకుండానే ఉపాధ్యక్ష, ఆరు డైరెక్టర్‌ పోస్టులు నేరుగా కేటాయించారు. దీంతో జయకృష్ణ వర్గం జీర్ణించుకోలేక ఆరోపణలు, విమర్శలు, సవాళ్లకు దిగింది. ఇటీవల పట్టణంలోని ఓ కళ్యాణ మండంలో ఎమ్మెల్యే మద్దతు వర్గం బహిరంగంగానే.. అచ్చెన్నాయుడు స్థానికంగా గ్రూపులు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. ఈ సమస్యను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌ అయ్యాయి.

పార్టీ పరిశీలకుని వద్దే ఘర్షణ

ఈ వివాదం చివరికి ఘర్షణ వరకూ వచ్చింది. టీడీపీ సభ్యత్వ పత్రాలు అందించేందుకు పాలకొండలోని ఓ కళ్యాణపమండపంలో నియోజకవర్గ నాయకులు, సభ్యులతో అరకు పార్లమెంట్‌ పరిశీలకుడు హర్షప్రసాద్‌ సమావేశమయ్యారు. ఆయన ఎదుటే టీడీపీలో వర్గపోరు బయట పడింది. భూదేవి, ఆమె వర్గానికి పదవులు ఎలా కేటాయిస్తారని, తక్షణమే అమెను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని, వారికి కేటాయించిన నామినేటెడ్‌ పోస్టులు రద్దు చేయాలని మరో వర్గానికి చెందిన ‘తమ్ముళ్లు’ నినాదాలు చేశారు. పరిశీలకుడు వారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల వారూ పరస్పర ఆరోపణలకు దిగారు. నెట్టుకుంటూ వాదోపవాదనలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇన్‌చార్జి భూదేవిని సైతం తోసేశారు. ఎమ్మెల్యే మద్దతుదారులైన టీడీపీ నాయకులు కర్రెన అప్పలనాయుడు, జాడ శివప్రసాద్‌తోపాటు మరి కొంత మంది మీడియా ఎదుటే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. భూదేవిని బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలంటూ నినాదాలు చేసుకుంటూ, ర్యాలీగా బయటకు వెళ్లిపోయారు. ఉద్రిక్తత నడుమే భూదేవి కూడా తన వాహనం ఎక్కి వెనుదిరిగారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనను ఆరోపిస్తున్న వారు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించారని.. వారు నాయకులా, గూండాలా? అని ప్రశ్నించారు. ఈ గందరగోళ స్థితి మధ్య కార్డుల పంపిణీ మధ్యలోనే నిలిపివేసి పరిశీలకులు వెనుదిరిగారు.

న్యూస్‌రీల్‌

కురుపాం నియోజకవర్గంలో తమ్ముళ్ల ‘పంచాయితీ’

మరోవైపు కురుపాం నియోజకవర్గంలోనూ తెలుగు తమ్ముళ్ల మధ్య గ్రూపుల పంచాయితీ నడుస్తోంది. ఆధిపత్యం, ఉనికి కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నిత్యం రోడ్డెకెక్కుతున్నారు. గ్రూపు రాజకీయాలతో కత్తులు నూరుకుంటున్నారు. ప్రధానంగా కురుపాం, కొమరాడ మండలాల్లో తమ్ముళ్ల మధ్య ‘సఖ్యత’.. ఉప్పు, నిప్పులా ఉంది. పదవుల కేటాయింపులో అసంతృప్తి మధ్య విభేదాలకు కారణమవుతోంది. శుక్రవారం ఓ వర్గం కొమరాడ మండలంలో ఎమ్మెల్యే వద్ద పంచాయితీ పెట్టగా.. శనివారం మరో వర్గం కలిసినట్లుగా తెలుస్తోంది. కొమరాడ మండలంలో పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు ఎవరు గొప్ప అన్నఅంశంతో ఆధిపత్యపోరు మొదలైంది. ఈ వివాదం కాస్త కూటమి ఎమ్మెల్యే వద్దకు చేరింది. ఆమె సూచనతో మధుసూదనరావు, వెంకటనాయుడు, పి.వెంకటనాయుడు, సుదర్శనరావు, శేఖర్‌పాత్రుడు తదితరులతో ‘ఐదుగురు సభ్యుల కమిటీ’ ఏర్పాటైంది. ఏ గ్రామంలో ఏ పనికావాలన్నా, పథకాలు, బీసీ రుణాలు మంజూరు కావాలన్నా, నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయాలన్నా ఈ కమిటీ అంగీకరించాల్సిందే. వీరు అధికార దర్పం ప్రదర్శించడంతో పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. మరో టీడీపీ నాయకుడు పార్టీ మండల పదవిని అడ్డం పెట్టుకుని పెత్తనం చేయడం మొదలుపెట్టాడు. ప్రభుత్వ శాఖల్లో తలదూర్చుతూ ఏ ౖపైనెనా తాను చెప్పినదే చేయాలని పట్టుబట్టాడు. ఐదుగురు సభ్యుల కమిటీ నిర్ణయాలను తోసిపుచ్చాడు. దీంతో పార్టీలో కుంపటి రాజుకుంది. మండల నాయకుడిని వ్యతిరేకిస్తూ 31 పంచాయతీల నుంచి ఓ అసమ్మతి వర్గం శుక్రవారం ఎమ్మెల్యే వద్ద పంచాయితీ పెట్టగా.. నాయకుడు సైతం తన మాట నెగ్గించుకునేందుకు ఎమ్మెల్యేను తన అనుచర వర్గంతో శనివారం కలిశారు. నాయకులంటే ప్రజలకు మేలు చేసేందుకు పోటీ పడతారని, కూటమి ప్రభుత్వంలో మాత్రం ప్రజాధనం దోచుకునేందుకు.. పదవులు పంచుకునేందుకు, రాజకీయ వివక్ష చూపేందుకు పోటీపడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శస్తున్నారు.

పరిశీలకులు ఎదురుగానే పాలకొండలో తమ్ముళ్ల బాహాబాహీ

గతంలో ఇచ్చిన నామినేటెడ్‌ పదవుల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిని మార్చాల్సిందేనని రోడ్డెక్కిన కార్యకర్తలు

నాయకులా.. గూండాలా? అంటూ ప్రశ్నించిన పడాల భూదేవి

అటు కురుపాం నియోజకవర్గంలోనూ ‘తమ్ముళ్ల’ మధ్య రోజుకో పంచాయితీ

ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20251
1/3

ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20252
2/3

ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 20253
3/3

ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement