చికెన్‌ | - | Sakshi
Sakshi News home page

చికెన్‌

Mar 17 2025 12:29 AM | Updated on Mar 17 2025 12:28 AM

బ్రాయిలర్‌ లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌లెస్‌ శ్రీ90 శ్రీ150 శ్రీ160

రామతీర్థంలో వైభవంగా పారాయణం

నెల్లిమర్ల రూరల్‌: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో తిరువాయుముజీ పాశురముల పారాయణాలను భక్తులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. అనకాపల్లికి చెందిన ఆచార్య గోష్ఠి బృంద సభ్యులు నాలాయర దివ్య ప్రబంధంలో తిరువాయుముజీ వెయ్యి పాశురాలను స్వామి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్‌, పవన్‌, తదితరులు పాల్గొన్నారు.

బాక్సింగ్‌లో ప్రతిభ

బొబ్బిలి: పట్టణంలోని యాదవ వీధికి చెందిన డీసరి భాను ప్రసాద్‌ ఏపీ స్టేట్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ 200 కిలోల విభాగంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈనెల 1,2 తేదీల్లో విశాఖలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన భాను ప్రసాద్‌ జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యే అవకాశాలున్నాయని కోచ్‌లు కేతిరెడ్డి సాయి వరుణ్‌, శంబంగి పురుషోత్తంలు తెలిపారు. భానుప్రసాద్‌ రాష్ట్ర స్థాయిలో ప్రథమ సాధించడంతో ఎమ్మెల్యే బేబీ నాయన రూ.20వేలను పోటీల ఖర్చుల నిమిత్తం అందజేశారు.

మేడపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

పార్వతీపురం రూరల్‌: ఇంటి మేడపై నుంచి ప్రమాద వశాత్తు జారిపడిన వ్యక్తి మృతిచెందినట్లు పార్వతీపురం రూరల్‌ ఎస్సై బి.సంతోషి పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెదబొండపల్లి గ్రామంలో పాత పోస్టాఫీసు వీధికి చెందిన పైలా తిరుపతిరావు(31) ఈనెల 7వ తేదీన తన ఇంటిమేడపై రాత్రి నిద్రిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి పడిపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కుటుంబసభ్యులు కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అక్రమ కట్టడాలపై హెచ్చరిక

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎల్విన్‌పేట గ్రామంలో సర్వే నంబర్‌ 60(గ్రామకంఠం) సర్వే నంబర్‌ 58, 61లకు చెందిన స్థలంలో నేతేటి ఈశ్వరరావు అనే గిరిజనేతర వ్యక్తి చేపడుతున్న కట్టడాలు అక్రమమైనవంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 1/70 చట్టానికి వ్యతిరేకంగా గిరిజనేతరుడు ఎల్విన్‌పేట వద్ద (గుణుపూర్‌ జంక్షన్‌) ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదంటూ గిరిజనాభ్యుదయ సంఘం నాయకుడు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు పై చర్యలకు ఉపక్రమించారు. ఆ నిర్మాణాలు అక్రమ కట్టడాలుగా గుర్తించామని, నిర్మాణాలు తక్షణమే తొలగించాలని హెచ్చరించారు. తాము జారీ చేసిన హెచ్చరికలను అతిక్రమిస్తే సీసీఎల్‌ఏ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులో పొందుపరిచారు.

చికెన్‌1
1/2

చికెన్‌

చికెన్‌2
2/2

చికెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement