జత పళ్ల విభాగంలో విజేత బయ్యారం ఎడ్లు | - | Sakshi
Sakshi News home page

జత పళ్ల విభాగంలో విజేత బయ్యారం ఎడ్లు

Apr 28 2025 1:15 AM | Updated on Apr 28 2025 1:15 AM

జత పళ్ల విభాగంలో విజేత బయ్యారం ఎడ్లు

జత పళ్ల విభాగంలో విజేత బయ్యారం ఎడ్లు

దాచేపల్లి: స్థానిక వీర్ల అంకమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆదివారం జరిగాయి. జత పళ్ల విభాగంలో 10 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. పల్నాడు జిల్లా బయ్యారానికి చెందిన కడియం మణికంఠ ఎడ్ల జత 3,553 అడుగుల దూరం లాగి మొదటి స్థానంలో నిలిచాయి. ప్రకాశం జిల్లా బసినేపల్లికి చెందిన యండ్లకంట్ల వెంకట చైతన్యకుమార్‌ ఎడ్ల జత 3,500 అడుగుల దూరం బండలాగి రెండవ స్థానం, వైఎస్సార్‌ కడప జిల్లా పాలూరుకి చెందిన కొణుదల హేమలతరెడ్డి ఎడ్లజత 3,324 అడుగుల దూరం బండ లాగి మూడో స్థానంలో నిలిచాయి. మాచయపాలేనికి చెందిన గౌరు కార్తికేయ, అబ్బూరుకి చెందిన నక్క బలరామకృష్ణయ్య సంయుక్త ఎడ్లజత 3,278 అడుగుల దూరం లాగి నాలుగో స్థానం, దాచేపల్లికి చెందిన కల్లూరి కార్తిక్‌ నాయుడు, భార్తవ్‌ నాయుడు ఎడ్లజత 3.235 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, మేళ్ల చెరువుకి చెందిన కొప్పుల గోవర్ధన్‌రెడ్డి, ప్రవలీష్‌రెడ్డి ఎడ్లజత 3,195 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో నిలిచాయి. విజేతలకు నగదు, షీల్డ్స్‌ను దాతలు బహూకరించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా గూడా శ్రీనివాసరావు వ్యవహరించారు. కమిటీ సభ్యులు కొప్పుల గిరి, మునగా నిమ్మయ్య, అనిశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement