క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి

Apr 25 2025 8:18 AM | Updated on Apr 25 2025 8:18 AM

క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి

క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి

సత్తెనపల్లి: చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయ ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ బి. కిరణ్‌రెడ్డి అన్నారు. సత్తెనపల్లి లోని పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయ ఆవరణలో హైదరాబాద్‌ 54వ రీజినల్‌ స్థాయి అండర్‌–17 బాల, బాలికల వాలీబాల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నతనం నుంచే చదువుతో పాటు క్రీడలు, అన్ని రంగాల్లోనూ విద్యార్థులు రాణించాలన్నారు. క్రీడల వల్ల శారీరక ధృఢత్వంతో పాటు చురుకుదనం ఉంటుందన్నారు. క్రీడల్లో రాణించడం వల్ల ప్రత్యేక అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అండర్‌–17 బాలికలు 8 జట్లు హాజరయ్యాయి. పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయం సత్తెనపల్లి, వాల్తేరు, విజయవాడ–1, బొల్లారం, హక్కింపేట, ఖమ్మం, తెనాలి జట్లు హాజరు కాగా లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయం సత్తెనపల్లి, వాల్తేరు, ఖమ్మం, తెనాలి జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. శుక్రవారం సెమీఫైనల్స్‌ అనంతరం ఫైనల్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు రిఫరీలుగా ఎం. శేషశ్రీనివాసరావు, ఈ రవీంద్ర, ఎం. నరసింహారావు, షేక్‌ మహమ్మద్‌ రియాద్‌, పాలపర్తి గోవింద్‌, టీ.లక్ష్మీపతి వ్యవహరించారు. క్రీడా పోటీలను వీక్షించేందుకు క్రీడాకారులు, క్రీడాభిమానులు, పెద్ద ఎత్తున హాజరయ్యారు.

పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయ ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ కిరణ్‌ రెడ్డి హైదరాబాద్‌ రీజినల్‌ స్థాయి అండర్‌–17 బాలబాలికల వాలీబాల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement