రాయగడ: స్థానిక కరణం వీధి సమీపంలోని కోదండరామ మందిరంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని లక్ష కుంకుమార్చన పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అనంత ఆచార్యుల ఆధ్వర్యంలో పూజల్లో అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తొలుత స్వామివారికి విశేష పూజలు, భిషేకాలు నిర్వహించారు. అలాగే స్థానిక బాలాజీనగర్లోని శ్రీకల్యాణ వేంకవేశ్వర మందిరంలో ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా రాజ్యలక్ష్మి సామూహిక వ్రతాలు నిర్వహించారు.


