రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలి మృతి

Aug 22 2026 1:47 AM | Updated on Aug 22 2026 1:47 AM

వజ్రపుకొత్తూరు రూరల్‌ : పలాస–పూండి రైల్వే స్టేషన్‌ పరిధిలో గరుడఖండి సమీపంలో శుక్రవా రం గుర్తు తెలియని వృద్ధురాలు (సుమారు 60 ఏళ్లు) రైలు ఢీకొని మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్‌ఐ దుంపల శ్రీనివాసరావు తెలిపారు. మృతురాలు ఆకుపచ్చ జాకెట్‌, లేత గులాబీ రంగు చీర ధరించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వివరాలు తెలిస్తే 9247585738 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.

ఇచ్ఛాపురం–జాడుపూడి రైలు నిలయం మధ్య..

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం – జాడుపూడి రైలు నిలయం మధ్య ఆఫ్‌లైన్‌ ట్రాక్‌లో శుక్రవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు తెలిపా రు. పలాస వైపు వెళ్లే మార్గంలో గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుందని, పసుపు షర్ట్‌ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే పలా స జీఆర్‌పీ ఎస్సైని సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement