● నేటి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ ఆహ్వాన నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి బాపూజీ కళామందిర్లో ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం బాపూజీ కళామందిర్ వద్ద ఏర్పాట్లు చేశారు.
● రాత్రి 7 గంటలకు శివశ్రీ నృత్య కళానికేతన్ విద్యార్థుల నృత్య ప్రదర్శన.
● 7.30 గంటలకు హైదరాబాద్కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘సీ్త్ర మాత్రే నమః’ నాటిక ప్రదర్శన.
● 9 గంటలకు పెందుర్తికి చెందిన నటరాజ డ్రమోటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘నీళ్లు– నీళు’ సాంఘిక నాటిక.
● 11న 7గంటలకు విశాఖపట్నం వారికి చెందిన తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ‘చిటికెన వేలు’ నాటిక.
● 8.30 గంటలకు విజయవాడకు చెందిన శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్’ ఆధ్వర్యంలో ‘మరో పుత్తడి బొమ్మ’ నాటిక.
● 12న 6గంటలకు ఎల్.రామలింగస్వామికి జీవితి సాఫల్య పురస్కార సభ.
● 7.30 గంటలకు కాకినాడకు చెందిన బీవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ‘కన్నీటికి విలువెంత’ నాటిక ప్రదర్శిస్తారు.
● 9గంటలకు విజయవాడకు చెందిన హర్ష క్రియేషన్స్ ఆధ్వర్యంలో ‘చెరిగిపోని చిరునామా’ నాటికలు పోటీలు ప్రదర్శిస్తారు. ఆనంతరం ముగింపు సభ, బహుమతి ప్రధానోత్సవం ఉంటాయి.


