భద్రక్‌లో గవర్నర్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

భద్రక్‌లో గవర్నర్‌ పర్యటన

Aug 20 2025 5:51 AM | Updated on Aug 20 2025 5:51 AM

భద్రక్‌లో గవర్నర్‌ పర్యటన

భద్రక్‌లో గవర్నర్‌ పర్యటన

భువనేశ్వర్‌: రాష్ట్రంలోని భద్రక్‌ జిల్లాలో గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి మంగళవారం పర్యటించారు. బొడొబార్చికయన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్‌ క్లస్టర్‌ను సందర్శించారు. స్వావలంబన, గ్రామీణ పరివర్తన, సమ్మిళిత వృద్ధిని పెంపొందించడంలో ఇక్కడి వారి ప్రయత్నాలను ప్రశంసించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. కొడొబారంగొ గ్రామీణ పారిశ్రామిక పార్కు సందర్శించి స్వయం సహాయక బృందాలు, ఉత్పత్తిదారుల బృందాలు మరియు లఖ్‌పతి దీదీలతో సంభాషించారు. ఈ సంభాషణలో స్వావలంబన, మహిళా సాధికారత మరియు సామాజిక గ్రామీణ సంస్థల స్ఫూర్తిదాయకమైన అనుభవాలను పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement