
బిసి ప్రాస్క గ్రామంలో దాహం కేకలు
రాయగడ : జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి సెరిగుమ్మ పంచాయతీలోని బీసీ ప్రాస్క గ్రామంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. బిందెడు నీటి కోసం మైళ్ల కొద్దీ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో 20 కుటుంబాలకు చెందిన వంద మందికి పైగా ఆదివాసీలు నివసిస్తున్నారు. ఉన్న ఒక్క గొట్టపు బావి పాడైపొవడంతో సుమారు కిలోమీటరు దూరంలో గల సునాజొర్ తోట సమీపంలో ఉన్న నది నుంచి నీటతిని సేకరించి వాటిని తాగేందుకు వినియోగించాల్సి వస్తోందని గ్రామస్తులు అంటున్నారు. గత కొద్ది రోజుల కిందట కళ్యాణసింగుపూర్ సమితిలో జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఇదే సమస్యకు సంబంధించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఇంతవరకు స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

బిసి ప్రాస్క గ్రామంలో దాహం కేకలు