
భారీగా బెల్లం ఊట ధ్వంసం
మెళియాపుట్టి/పాతపట్నం: గిరిజన గ్రా మాల్లో నాటు సారా స్థావరాలపై దాడులు ముమ్మరం చేస్తున్నట్లు టెక్కలి ఎకై ్స జ్ సీఐ షేక్ మీరా సాహెబ్ అన్నారు. గురువారం మెళియాపుట్టి మండలం ఎగువబగడ గ్రామంలో ఎకై ్సజ్ సిబ్బంది సారా తయారీ స్థావరాలపై గురువారం దాడులు నిర్వహించారు. 800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 60 లీటర్ల సారా, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో పలువురు సిబ్బంది ఉన్నారు. అదే విధంగా పాతపట్నం మండలం చాపరాయిగూడ పరిధిలో సారా బట్టీలపై దాడులు జరిపారు. 200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ శ్రీనివాసరావు, సిబ్బంది సోమనాథం, వాసుదేవరావు, శివ పాల్గొన్నారు.

భారీగా బెల్లం ఊట ధ్వంసం