పశువులకు ఆధునిక వైద్యం అవసరం | - | Sakshi
Sakshi News home page

పశువులకు ఆధునిక వైద్యం అవసరం

Mar 26 2025 12:53 AM | Updated on Mar 26 2025 12:49 AM

పర్లాకిమిడి: రోడ్లపై ప్లాస్టిక్‌ పదార్థాలను తినడం వలన పశువులు రోగాల బారిన పడుతున్నాయని, అందువలన వాటికి ఆధునిక వైద్యం అవసరమని కలెక్టర్‌ బిజయ కుమార్‌ దాస్‌ అన్నారు. స్థానిక సెంచూరియన్‌ వర్సిటీ క్యాంపస్‌లో పశువులకు ఆధునిక వైద్య విధాన శిక్షణ ఆస్కాడ్‌– 2025 తరగతులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పశువైద్యశాఖ అధికారి రమాకాంత రోణా మాట్లాడుతూ.. పశు వైద్యులు గ్రామాల్లో పర్యటించి చికిత్సలు అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. పాడి రైతులు అధిక పాల దిగుబడులు సాధించేలా సూచనలు అందించాలని సూచించారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఆస్కాడ్‌ పశువైద్యుల ట్రైనింగ్‌ ప్రోగ్రాంలో తొమ్మిది జిల్లాల నుంచి పశువైద్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ కళాశాల డీన్‌ ఆర్‌.కె.స్వయిని, ట్రైనింగ్‌ కో–ఆర్డినేటర్‌ గిరీష్‌ మహంతి, సెంచూరియన్‌ వర్సిటీ డీన్‌ డా.అనితా పాత్రో, అగ్రికల్చర్‌ స్కూల్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్పీ నందా తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ బిజయకుమార్‌ దాస్‌

పశువులకు ఆధునిక వైద్యం అవసరం 1
1/1

పశువులకు ఆధునిక వైద్యం అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement