సాగునీరు ఇవ్వకుండా పాలకులు రైతులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున అట్టహాసంగా ఏరువాక కార్య క్రమం నిర్వహించి ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసి ఇప్పుడు సాగునీరు ఇవ్వలేమంటున్నారు. నీటికి ఇబ్బందులు వస్తాయని ముందే తెలిస్తే ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించలేదు. గతంలో దెబ్బతిన్న పంటలకు కూడా ఇంత వరకు నష్టపరిహారం ఇవ్వలేదు. రైతుల తరఫున పోరాటం ఆపేది లేదు. – పేర్ని కృష్ణమూర్తి (కిట్టు),
వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి


