ఫీజులు లేకుండా అనుమతులివ్వండి | - | Sakshi
Sakshi News home page

ఫీజులు లేకుండా అనుమతులివ్వండి

Aug 20 2025 5:07 AM | Updated on Aug 20 2025 5:07 AM

ఫీజుల

ఫీజులు లేకుండా అనుమతులివ్వండి

ఫీజులు లేకుండా అనుమతులివ్వండి లబ్బీపేట(విజయవాడతూర్పు): గణేష్‌ ఉత్సవాలకు ఎలాంటి ఫీజులు లేకుండా సింగిల్‌ విండో పద్ధతిలో అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని ఏపీ గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు మంగళవారం రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాను కోరారు. ఈ మేరకు సమితి గౌరవాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు బీవీ రమణకుమార్‌, ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్‌, కార్యదర్వి దుర్గాప్రసాద్‌ డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 27 నుంచి గణేష్‌ ఉత్సవాలు నిర్వహించే వారు మండ పాలకు పెట్టుకునే అర్జీ ఆధారంగా సింగిల్‌ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలన్నారు. కాగా గణేష్‌ ఉత్సవ సమితి సూచన మేరకు సింగిల్‌ విండో పద్ధతిలో ఒక యాప్‌ను రూపొందించి, దానిలో నమోదు ద్వారా అనుమతులు ఇస్తామని.. అందరి సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేద్దామని డీజీపీ చెప్పినట్లు సమితి సభ్యులు తెలిపారు. అన్న క్యాంటీన్‌ సందర్శన మాజీ సైనికుల న్యాయ సేవా కేంద్రం ప్రారంభం పసుపు కొమ్ములతో మహాభిషేకం

డీజీపీని కోరిన ఏపీ గణేష్‌ ఉత్సవ సమితి

కృష్ణలంక(విజయవాడతూర్పు): స్థానిక రాణిగారితోటలో జాతీయ రహదారి పక్కన అన్న క్యాంటీన్‌ను మంత్రి సవిత మంగళవారం సందర్శించారు. అక్కడ పరిసరాలను, పాత్రలు శుభ్రం చేసే గదిని పరిశీలించారు. లైన్‌లో నిల్చొని రూ.5ల టోకెన్‌ తీసుకుని భోజనం చేశారు. తనతో పాటు భోజనం చేస్తున్న వారిని అప్యాయంగా పలకరించారు. అన్న క్యాంటీన్‌ను, ఎప్పటికప్పుడు ఆహార పదార్థాల పాత్రలను, ప్లేట్లను శుభ్రం చేస్తున్న సిబ్బందిని మంత్రి అభినందించారు.

విజయవాడలీగల్‌: మాజీ సైనిక ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారం నిమిత్తం వీర పరివార్‌ సహాయక యోజన పేరుతో లీగల్‌ సర్వీస్‌ క్లినిక్‌ను కృష్ణాజిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్‌ గుట్టల గోపీ మంగళవారం ప్రారంభించారు. నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలోని మాజీ సైనికుల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిఫెన్స్‌లో పనిచేసిన మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయసేవలు త్వరితగతిన అందించే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశామన్నారు. మండల న్యాయ సేవాధికారి, రెండో అదనపు జిల్లా జడ్జి ఏ. సత్యానంద మాట్లాడుతూ న్యాయ సహాయక క్లినిక్‌లో ప్రతి శనివారం మాజీ సైనిక ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమానికి డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సెక్రటరీ కేవీ రామకృష్ణయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఏసీబీ కోర్టు జడ్జి పి. భాస్కరరావు, బెజవాడ బార్‌ అధ్యక్షుడు ఏకే బాషా తదితరులు పాల్గొన్నారు.

నాగాయలంక: స్థానిక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్‌లోని శ్రీగంగ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి మండపంలోని స్వామివారి శివలింగానికి మంగళవారం ప్రదోషకాలంలో 108 కేజీల పసుపు కొమ్ములతో మహాభిషేకం జరిపారు. శ్రావణమాసం బహుళ ఏకాదశి, ఆఖరి మంగళవారం విశిష్టతను పురస్కరించుకొని భక్తులు, దాతలు సమర్పించే పసుపు కొమ్ములతో ఈ అభిషేకం, అర్చన జరిపారు.

ఫీజులు లేకుండా అనుమతులివ్వండి 1
1/2

ఫీజులు లేకుండా అనుమతులివ్వండి

ఫీజులు లేకుండా అనుమతులివ్వండి 2
2/2

ఫీజులు లేకుండా అనుమతులివ్వండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement