నిజామాబాద్ రూరల్: ప్రపంచంలో అత్యధిక యువ జనా భా ఉన్న దేశం భారతదేశం ఒక్కటేనని ఇందూర్ విభాగ ప్రచారక్, తెలంగాణ ప్రాంత సహబౌద్ధిక్ ప్రముఖ్ నర్రా వెంకట శివ కుమార్జీ పేర్కొన్నారు. బుధవారం ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడు కలలో భాగంగా కోటగల్లి, గాజులపేట ఉపనగరాల యువ సమ్మేళనం టీటీడీ కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్తగా ఆయన మాట్లాడుతూ.. యువత సరైన ఆలోచనలతో ముందుకు వెళితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. సత్యం, సుమిత్, రామకృష్ణ శరత్, బున్ని నవీన్, భా ర్గవ్, మణితేజ, రంజిత్, శ్రావణ్ పాల్గొన్నారు.


