
పేకాడుతున్న 10మంది అరెస్టు
ఎల్లారెడ్డి: మండలంలోని వెల్లుట్లపేట శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో శుక్రవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై మహేష్ శనివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.43,150ల నగదు, 10 సెల్ఫోన్లు, 11 బైకులు సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మరో నలుగురు పరారైనట్లు ఆయన తెలిపారు.
గుంతలో దిగపడిన లారీ
నస్రుల్లాబాద్: మండల కేంద్రంలో ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో దిగబడిపోయింది. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతుండగా రహదారి పక్కన గుంతలు తవ్వా రు. ఈక్రమంలో శుక్రవారం మండల కేంద్రంలోని సమీకృత భవనం ఎదురుగా వర్ని వైపునకు వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో దిగిపోయింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు పనుల నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు, బార్డర్ లైన్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వీధి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
నిజామాబాద రూరల్: మండలంలోని మాధవనగర్ పరిధిలో వీధి కుక్కల దాడిచేయడంతో ఓ బాలుడికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. మాధవనగర్ మూడో డివిజన్కు చెందిన సుశాంత్ అనే ఐదేళ్ల బాలుడు శనివారం ఇంటి బయట ఆడుకుంటున్నాడు. వీధికుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమివేసి, బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

పేకాడుతున్న 10మంది అరెస్టు