రావుల మధుకు డాక్టరేట్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం పరిశోధక విద్యార్థి రావుల మధు పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. వర్సిటీ అధ్యాపకుడు వాసం చంద్రశేఖర్ పర్యవేక్షణలో ‘ప్రిపరేషన్ డెవలప్మెంట్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ నావెల్ నానో క్రిస్టలైన్ సిరియా బేస్డ్ ఎట్రోజీనియస్ క్యాటలిస్ట్ ఫర్ ది కటలిటీక్ ఎవాల్యూషన్ ఆఫ్ సెలెక్టివ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆరోమాటిక్ అమైన్న్స్’ అనే అంశంపై మధు పరిశోధన జరిపారు. బుధవారం నిర్వహించిన బహిరంగ మౌఖిక పరీక్షకు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ టీ సవిత జోత్స్న ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా వ్యవహరించారు. కార్యక్రమంలో వర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ మావురపు సత్యనారాయణ రెడ్డి, సైన్స్ డీన్ ఆచార్య కే సంపత్ కుమార్, బోయపాటి శిరీష, అధ్యా పకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
పోలీసుల విస్తృత తనిఖీలు
ఖలీల్వాడి: నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా 50 మంది పోలీసులతో బుధవారం తనిఖీలు నిర్వహించారు. శాంతినగర్, ఖిల్లా, వర్ని చౌరస్తా, బాబన్ సహబ్ పహాడీ ఏరియాల్లోని అనుమానితుల ఇండ్లను డాగ్స్క్వాడ్ బృందాలతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని, మైనర్ డ్రైవింగ్ చేస్తున్న 17 వాహనాలను సీజ్ చేశారు. నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, టీఎస్ఎస్పీ స్టాఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
కానిస్టేబుళ్లకు పదోన్నతి
ఖలీల్వాడి: బాసర జోన్లో పనిచేస్తున్న పలువురు సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు బాసర జోన్ డీఐజీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ పరిధిలో మొత్తం 28 మంది కానిస్టేబుళ్లకు ప్రమోషన్ కల్పించగా, జిల్లాలో పని చేస్తున్న 15 మంది కానిస్టేబుళ్లు పదోన్నతి పొందారు. వీరిలో కొందరిని జగిత్యాలకు బదిలీ చేశారు.
రావుల మధుకు డాక్టరేట్


