
హెడ్ కానిస్టేబుల్ కొడుకు ఐఏఎస్ కు ఎంపిక
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): డిచ్పల్లి సర్కిల్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న జాదవ్ గోవింద్ కుమారుడు జాదవ్ సాయిచైతన్య యూపీఎస్సీ సివిల్స్ పరీక్షా ఫలితాల్లో ఆల్ ఇండియా 68వ ర్యాంక్ సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యారు. గత సంవత్సరం సివిల్స్ లో ఐఎఫ్ఎస్ కు ఎంపికై న సాయి చైతన్య పట్టుదలతో చదివి మంగ ళవారం ప్రకటించిన సివి ల్స్ ఫలితాల్లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. దీంతో డీజీపీ జితేందర్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య లు హెడ్కానిస్టేబుల్ జాదవ్ గోవింద్, ఐఏఎస్ సాధించిన సాయిచైతన్య లను ప్రత్యేకంగా అభినందించారు.
అభినందించిన డీజీపీ, సీపీ