
పదేళ్లు సదస్సులు మర్చిపోయారు
గత ప్రభుత్వం పదేళ్లలో రైతు సదస్సులు మర్చిపోయిందని, ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వం మళ్లీ రైతు సదస్సులు నిర్వహిస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఇరిగేషన్ అధికారులు ఊసరవెల్లిలా ప్రవర్తించడంపై ఆయన మండిపడ్డారు. ఆదర్శ రైతు పథకాన్ని పున: ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రిని కోరారు.
అవినీతికి పాల్పడ్డారు
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు 20, 21 ప్యాకేజీ పనులకు రూ.300 కోట్లు కేటాయిస్తే రైతులకు నీరందేదని, బీఆర్ఎస్ పైపుల ద్వారా సాగునీరు అందిస్తామని రూ.3వేల కోట్లు ఇచ్చి, అందులో రూ.2వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఆరోపించారు. పసుపు అధిక కుర్కుమిన్ వచ్చే వంగడాల సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చని తెలిపారు. కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నాయని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.
కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరతతో రైతులు రోజుల తరబడి కల్లాల వద్దే ఉంటున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి అన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, అంచనా మేరకు కాంటాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా, బోనస్ త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.

పదేళ్లు సదస్సులు మర్చిపోయారు

పదేళ్లు సదస్సులు మర్చిపోయారు