
జాతీయస్థాయి పోటీలకు తొర్లికొండ విద్యార్థులు
జక్రాన్పల్లి: మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన శశికుమార్, గంగోత్రి జాతీయస్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్మల్లో జరిగిన 68వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ అండర్–17 బేస్బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈ నెల 22 నుంచి 26 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో శశికుమార్, గంగోత్రి పాల్గొంటారని ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగామోహన్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను ప్రధానోపాధ్యాయుడు, ఇన్చార్జీ ఎంఈవో శ్రీనివాస్ అభినందించారు.
రీవాల్యుయేషన్కు
దరఖాస్తు చేసుకోవాలి
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు సంబంధించి ఏప్రిల్లో విడుదలైన 1, 3, 5వ సెమిస్టర్స్, ఎల్ఎల్బీ 1, 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాల రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రీవాల్యుయేషన్ కోసం ఒక్కో పేపర్కు రూ.500 లు, దరఖాస్తు ఫారానికి రూ.25 లు ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 26 వరకు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్www. telangana university. ac. in ను సందర్శించాలని సూచించారు.
పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వాలి
రుద్రూర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు ఆయా పాఠశాలల అభివృద్ధికి చేయూత అందించాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ సూచించారు. రుద్రూర్ హైస్కూల్లో 1965 నుంచి 2015 వరకు చదివిన విద్యార్థులతో రైడ్స్ (రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ)ని ఏర్పాటు చేయగా.. అందుకు సంబంధించిన లోగోను జేటీసీ శనివారం ఆవిష్కరించారు. అనంతరం రైడ్స్ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రైడ్స్ శాశ్వత గౌరవ అధ్యక్షుడిగా తనను ఎన్నుకోవడంపై సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రైడ్స్ కార్యక్రమాలకు మామిండ్ల రామాగౌడ్ స్మారక ట్రస్ట్ అండగా ఉంటుందని అన్నారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడంతోపాటు పేద విద్యార్థుల ఉన్నత చదువులకు రైడ్స్ ద్వారా తోడ్పాటు అందిస్తామన్నారు.

జాతీయస్థాయి పోటీలకు తొర్లికొండ విద్యార్థులు