
జిల్లాకు చేరిన ఐద్వా బస్సు యాత్ర
నిజామాబాద్ సిటీ: ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర జిల్లాకు చేరింది. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నాందేవాడ సీపీఎం కార్యాలయానికి వచ్చింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. ఈ బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టడమేనన్నారు. అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం పోరాటాలు చేయాలన్నారు. ఫులే, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకులు అరుణజ్యోతి, ఆశలత, సాయిలీలతోపాటు జిల్లా నాయకులు సుజాత, అనిత, రజియా, మాధవి, కళావతి, స్వప్న పాల్గొన్నారు.