డిచ్పల్లి/ ఇందల్వాయి/ సిరికొండ/ నిజామాబాద్ రూరల్: పదో తరగతి పరీక్షలు నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. డిచ్పల్లి మండలంలో ఏర్పాటు చేసిన ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1268 మందికి 1266 మంది హాజరు కాగా ఇద్దరు విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంఈవో సుధాకర్రెడ్డి తెలిపారు. మోడల్ స్కూల్లో ఒకరు, గురుకుల పాఠశాలలో ఒకరు గైర్హాజరైనట్లు ఎంఈవో పేర్కొన్నారు. ఇందల్వాయి మండలంలోని గన్నారం, ఎల్లారెడ్డిపల్లె, సిర్నాపల్లి, ఇందల్వాయి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో మొత్తం 467 మందికి ఇద్దరు గైర్హాజరైనట్లు ఎంఈవో శ్రీధర్ తెలిపారు. సిరికొండ మండలంలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో 569 మందికి గాను సిరికొండ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల పరీక్ష కేంద్రంలో ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు ఎంఈవో రాములు తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు. రూరల్ మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనట్లు పరీక్ష నిర్వహణ అధికారి భూమాగౌడ్ తెలిపారు.
‘పది’ పరీక్షలు.. విస్తృతంగా తనిఖీలు