దూసుకొచ్చిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Mar 21 2025 1:35 AM | Updated on Mar 21 2025 1:30 AM

విధుల్లో ఉన్న పోలీసులను ఢీకొన్న కారు

ఓ కానిస్టేబుల్‌ మృతి,

మరో కానిస్టేబుల్‌కు గాయాలు

గాంధారిలో వేకువజామున కలకలం రేపిన ఘటన

కామారెడ్డి క్రైం/గాంధారి: తెల్లవారుజామున గాంధారి నడిబొడ్డున అదుపుతప్పిన ఓ కారు బీభత్సం సృష్టించింది. బీట్‌ విధులు నిర్వహిస్తు న్న పోలీసులపైకి దూసుకు రావడంతో ఓ కానిస్టేబుల్‌ అక్కడికక్కడే మరణించగా మరొకరు గాయాలతో బయటపడ్డారు. గురువారం వేకువజామున 3 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గాంధారి పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు వడ్ల రవికుమార్‌ (35) సుభాష్‌ హనుమాన్‌ టిఫిన్‌ సెంటర్‌ ఎదురుగా బీట్‌ డ్యూటీ నిర్వ హిస్తున్నారు. ఆ సమయంలో కామారెడ్డి వైపు నుంచి బాన్సువాడ వైపు వెళ్తున్న ఓ కారు అతివేగంగా దూసుకువచ్చి ఢీకొనడంతో రవికుమార్‌ అక్కడికక్క డే మరణించాడు. కారు దూసుకు రావడాన్ని సెకండ్ల వ్యవధిలో గమనించిన మరో కానిస్టేబుల్‌ సుభా ష్‌ వేగంగా పక్కకు దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైన సన్నిత్‌కు సైతం గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిని స్థానిక ఆర్‌ఎంపీ కుమారుడిగా గుర్తించారు. వాహనం నడుపుతున్న సమయంలో మద్యం మత్తులో ఉండొచ్చని భావిస్తున్నారు.

మిన్నంటిన రోదనలు..

2007 బ్యాచ్‌కు చెందిన రవికుమార్‌ది తాడ్వాయి మండలం దేమె గ్రామం కాగా, కామారెడ్డిలోని దేవునిపల్లిలో స్థిరపడ్డారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగంలో విధులు నిర్వహించి ఇటీవలే గాంధారికి బదిలీ అయ్యాడు.

అండగా ఉంటాం

కానిస్టేబుల్‌ రవికుమార్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని ఎస్పీ రాజేశ్‌ చంద్ర పేర్కొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి వద్ద రవికుమార్‌ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

దూసుకొచ్చిన మృత్యువు 1
1/1

దూసుకొచ్చిన మృత్యువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement