కాలువ వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

కాలువ వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు

Mar 19 2025 1:34 AM | Updated on Mar 19 2025 1:33 AM

బాన్సువాడ రూరల్‌: నిజాంసాగర్‌ ప్రధాన కాలువ ద్వారా నీటిని వదిలిన ప్రతిసారి ఎక్కడో ఓ చోట నీటి ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవల సంగ్రాం తండాకు చెందిన సిద్దార్థ అనే 19 ఏళ్ల యువకుడు నీటిప్రవాహంలో కొట్టుకుపోయి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చాడు. వరుస నీటిప్రమాదాలతో స్పందించిన నీటిపారుదల శాఖ అధికారులు నిజాంసాగర్‌ ప్రధాన కాలువ కట్టపై ప్రమాదం పొంచి ఉందంటూ హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అంకిత భావంతో పనిచేయాలి

కామారెడ్డి క్రైం: అంకిత భావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సూచించారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఎంపికై న స్టాఫ్‌ నర్సులు, వాక్సిన్‌ కోల్డ్‌ చైన్‌ మేనేజర్‌ లకు మంగళవారం తన చాంబర్‌ లో నియామక పత్రాలను కలెక్టర్‌ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం లోకి వచ్చిన వారు అంకిత భావంతో పనిచేయాలన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 26 మందికి , వాక్సిన్‌ కోల్డ్‌ చైన్‌ మేనేజర్‌ గా ఒకరికి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, సబ్‌ యూనిట్‌ అఽధికారి చలపతి తదితరులు పాల్గొన్నారు.

ఎంపీవో, సెక్రెటరీకి మెమోలు

గాంధారి(ఎల్లారెడ్డి): జిల్లాలో తాగునీటి సమస్యలపై ‘సాక్షి’లో ‘గొంతు తడిసేదెలా?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ స్పందించారు. తాగు నీటి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో గాంధారి ఎంపీవో లక్ష్మీనారాయణ, సోమ్లానాయక్‌ తండా పంచాయతీ కార్యదర్శి దేవీసింగ్‌కు కలెక్టర్‌ మెమోలు జారీ చేసినట్లు ఎంపీడీవో రాజేశ్వర్‌ తెలిపారు. సోమ్లానాయక్‌ తండాను అధికారులు సోమవారం సందర్శించి విచారణ చేపట్టారు. పరిస్థితులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు.

కాలువ వద్ద హెచ్చరిక  ఫ్లెక్సీలు ఏర్పాటు
1
1/2

కాలువ వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు

కాలువ వద్ద హెచ్చరిక  ఫ్లెక్సీలు ఏర్పాటు
2
2/2

కాలువ వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement