
రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి
నిజామాబాద్అర్బన్ : ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర వాటితో ముడిపడిన అంశాలపై చర్చించేందుకు వీలుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్ సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఈఆర్వోలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అధికారులు తమతమ స్థాయిలో రాజకీయ పార్టీలతో మీటింగ్లు ఏర్పాటు చేసి అప్డేట్స్ అందించాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను రిజిస్టర్లలో నమోదు చేసి వివరాలను సీఈవో కార్యాలయానికి, గుర్తింపు పొందిన పార్టీల ప్రధాన కార్యాలయాలకు పంపించాలన్నారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని సూచించారు. వీసీలో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.
వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల
అధికారి సీ సుదర్శన్