
ధ్వంసమైన మీసాల చంద్రయ్య కారు(ఫైల్)
ఖలీల్వాడి : డిచ్పల్లి మండలంలోని మాధవనగర్ సాయిబాబా ఆలయం వద్ద ఈనెల 10న బీజేపీ జిల్లా ఇన్చార్జి మీసాల చంద్రయ్య వెళ్తున్న కారుపై రాళ్లదాడి జరిగిన విషయం విదితమే..ఈ సంఘటనపై బీజేపీ నాయకులు అదేరోజు రాత్రి డిచ్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడి చేసిన ఇద్ద రిని పోలీసుల అదుపులోకి తీసుకుని విచారించి వదిలేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలే ఆరోజు కారుపై దాడి చేసినట్లు నగరంలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే జిల్లాకు చెందిన ఓ బీజేపీ ముఖ్య నాయకుడు పలువురికి డబ్బులు చెల్లించడంలో ఇబ్బందులకు గురిచేయడంతో వారు అతడిపై ఆగ్రహంగా ఉన్నారు. ఈనెల 10న మీసాల చంద్రయ్య వెళ్తున్న కారులో సదరు ముఖ్య నాయకుడు ఉన్నాడనే సమాచారంతో వారు కారుపై రాళ్ల దాడికి పాల్పడ్డట్లు తెలిసింది.
పెట్రోల్ పంప్ సిబ్బందిపై
దాడి ఘటనలో..
నస్రుల్లాబాద్(బీర్కూర్) : బీర్కూర్ మండల కేంద్రంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో గురువారం రాత్రి పంపులో పనిచేసే వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఫోన్పేలో డబ్బులు వేస్తామంటూ ఆఫీసులోకి వచ్చి విధుల్లో ఉన్న వ్యక్తిపై దాడి చేశారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులు బాన్సువాడ పట్టణానికి చెందిన సందీప్, సోమేశ్వర్కు చెందిన సంతోష్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులను అందుపులోకి తీసుకుని వివరాలను సేకరిస్తున్నామన్నారు. పెట్రోల్ పంప్లో డ్యూటీలో ఉన్న నాగరాజుకు తలపై గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.