నిర్మల్ రూరల్: ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా కార్యవర్గాన్ని శనివారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. ప్రిన్సిపల్ ప్రమోషన్లతో ఖాళీ అయిన స్థానాలకు నిర్వహించిన ఎ న్నికల్లో అధ్యక్షునిగా పట్వారి నవీన్కుమార్, మహిళా సెక్రటరీగా పి.శ్రీదేవి, కోశాధికారిగా కృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా అజీజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్, ఉపాధ్యక్షుడు సత్యపాల్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, జిల్లా ప్రిన్సిపల్ల సంఘం అధ్యక్షుడు తుకారాం, ప్రధాన కార్యదర్శి శంకర్ తదితరులు పాల్గొన్నారు.


