జామ్ గ్రామంలో..
సారంగాపూర్: మండలంలోని జామ్ గ్రామంలో వారసంతలో ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకుని తగులబెట్టారు. జూట్, బట్టసంచులు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మటన్, చికెన్ సెంటర్లలో టేకు ఆకులు వినియోగిస్తున్నారు. జామ్ గ్రామంలోని వేద పాఠశాల ఆధ్వర్యంలో రూ.5వేలు విలువచేసే జూట్బ్యాగులు తయారు చేసి పంపిణీ చేశారు. గ్రామంలో ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ‘స్టీల్ బ్యాంకులు’ ఏర్పాటు చేశారు. శుభకార్యాలకు ఉచితంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులను అందిస్తున్నారు.


