Jammu and Kashmir: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు | Terrorist Attack On Army Vehicle In Rajouri District | Sakshi
Sakshi News home page

Jammu and Kashmir: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు

Feb 26 2025 3:24 PM | Updated on Feb 26 2025 4:15 PM

Terrorist Attack On Army Vehicle In Rajouri District

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల కలకలం సృష్టిస్తున్నాయి. పెట్రోలింగ్‌ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు నాలుగు రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

బుధవారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా  సుందర్‌ మానీ బల్లా  రోడ్డు, ఫాల్‌ గ్రామం సమీపంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పెట్రోలింగ్‌ చేస్తున్న ఆర్మీ జవాన్ల వాహనంపై  కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని  డిఫెన్స్‌ అధికార ప్రతినిథి తెలిపారు.

ఉగ్రవాదుల కాల్పులపై సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని డిఫెన్స్‌ అధికార ప్రతినిథి వెల్లడించారు. అనంతరం, ఉగ్రవాదుల ఏరివేతకు  సెర్చ్‌ ఆపరేషన్‌ను  మొదలు పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం, ఉగ్రవాదుల కోసం సుందర్‌ బానీ ఏరియా మొత్తాన్ని ఆర్మీ జవాన్లు జల్లెడ పడుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement