Supreme Court Dismissed The Petition In Rushikonda Case - Sakshi
Sakshi News home page

రుషికొండ కేసు: పిటిషన్‌ను డిస్మిస్‌ చేసిన సుప్రీంకోర్టు

Nov 11 2022 12:12 PM | Updated on Nov 11 2022 2:00 PM

Supreme Court Dismissed The Petition In Rushikonda case - Sakshi

న్యూఢిల్లీ: రుషికొండ కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ కేసులో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.  ప్రతి ఇంచు జాగాకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా అని ప్రశ్నించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది. 

ఈ మేరకు  హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకూ వేచి చూడాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.  ఈ క్రమంలోనే పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది.  రుషికొండలో రెండు  కిలోమీటర్ల వరకు తవ్వకాలు జరిపారని సుప్రీంకోర్టుకు రఘురామకృష్ణరాజు న్యాయవాది ఫోటోలు ఇవ్వగా, జోక్యం చేసుకునేందుకు అత్యున్నత స్యాయస్థానం ఆసక్తి చూపలేదు.  

అభివృద్ధి - పర్యావరణం మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుకు వెళ్లాలని గతంలోనే సుప్రీంకోర్టు సూచించింది. అభివృద్ధి కూడా అవసరమేనని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement