ఢిల్లీలో భారీగా భూప్రకంపనలు.. జనం పరుగులు

Strong earthquake tremors felt in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో భూకంపం చోటు చేసుకుంది. మంగళవారం పలు ప్రాంతాల్లో భారీగా భూమి కంపించింది. కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో బయటకు పరుగులు తీశారు జనాలు.

ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్‌ ప్రాంతంలో భూకంప కేంద్ర నమోదు అయ్యింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్‌ పరిధిలో మధ్యాహ్నం 2.30 గం. ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.8 తీవ్రతగా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. 

జనం బయటకు పరుగులు తీయగా, మరికొందరు ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top