సర్దార్‌ పటేల్‌కు ప్రధాని మోదీ నివాళులు | PM Modi Pays Tribute To Sardar Patel | Sakshi
Sakshi News home page

సర్దార్‌ పటేల్‌కు ప్రధాని మోదీ నివాళులు

Oct 31 2024 8:21 AM | Updated on Oct 31 2024 9:09 AM

PM Modi Pays Tribute To Sardar Patel

న్యూఢిల్లీ: ఈరోజు (అక్టోబర్‌ 31) జాతీయ ఐక్యతా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్‌కు  నివాళులు అర్పించారు.

గుజరాత్‌లోని కేవడియాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రజలతో ఐక్యతా ప్రమాణం చేయించారు. జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
 

దీనికి ముందు ప్రధాని మోదీ సోషల్ మీడియా సైట్‌లో ఒక పోస్ట్‌లో ఇలా రాశారు.. దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం కోసం వల్లభాయ్‌పటేల్‌ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన వ్యక్తిత్వం, ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ పేర్కొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి(అక్టోబర్‌ 31)ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటారు. దీనిని రాష్ట్రీయ ఏక్తా దివస్ అని కూడా పిలుస్తారు . భారతదేశపు ఉక్కు మనిషిగా పేరొందిన పటేల్‌ దేశ స్వాతంత్ర్యం తర్వాత భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారు.

ఇది కూడా చదవండి: సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement