మే మొదటి వారంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన

New Delhi: Pm Modi To Visit Denmark Germany France May 2022 - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన.. జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ల్లో పర్యటించనున్నారు. బెర్లిన్‌లో ప్రధాని మోదీ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

అంతేకాకుండా వారిద్దరూ భారతదేశం- జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) ఆరవ ఎడిషన్‌కు సహ-అధ్యక్షులుగా ఉంటారు. ఇది ఛాన్సలర్ స్కోల్జ్‌తో ప్రధాని మొదటి సమావేశం. కాగా ఈ ఏడాది ప్రధాని మోదీకి ఇదే తొలి విదేశీ టూర్‌. చివరగా గతేడాది నవంబర్‌లో గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సుకు ఆయన హాజరయ్యారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top