నెలకు ఐదెంకల జీతం వస్తున్నా, నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. దయచేసి ఏం చేయాలో సలహా ఇవ్వండి అంటూ ఒక జంట పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. నేటి తరం యువ దంపతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడికి ఇది అద్దం పడుతోంది. నెలకు రూ. 1.7 లక్షల సంపాదన ఉన్నప్పటికీ, నెలాఖరుకు కేవలం రూ. 2,520 మాత్రమే మిగలడం లేదని వాపోయింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంత జీతం వస్తున్నా ఈఎంఐలు,అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆ జంట చెప్పుకు రావడం అనేది నిజంగా ఆందోళనకరమైన విషయమే. నిజానికి మామూలు మధ్యతరగతి కుటుంబానికి దాదాపు 2 లక్ష రూపాయలు జీతం అంటే సౌకర్యవంతంగానే గడిపేయొచ్చు. వీరి ఖర్చులు, కడుతున్న లోన్ల వివరాల ప్రకారం వీరి ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తే లోన్ల భారమే కారణంగా చెప్పవచ్చు.
వ్యక్తిగత రుణం (Personal Loan), విద్యా రుణం (education loan), బైక్ రుణం , ఫోన్ రుణం వంటి వాటి కోసం వారి నెలవారీ EMIల మొత్తం రూ. 85,980 అవుతోంది. ఇవి కాకుండా ఆ దంపతులు ఇంటి అద్దె, నిర్వహణ ఖర్చులు, సరుకులు, ప్రయాణం, వైద్య ఖర్చులు , ఇతర వినియోగ బిల్లుల వంటి స్థిరమైన నెలవారీ ఖర్చుల కోసం రూ. 53,500 వెచ్చిస్తున్నారు. అలాగే, వ్యక్తిగత ఖర్చులు, వినోదం , కుటుంబపరమైన అత్యవసర అవసరాల కోసం వారు రూ. 28వేలు కేటాయించారు. అన్ని ఖర్చులు పోను, వారి చేతిలో నెలకు కేవలం రూ. 2,520 మాత్రమే మిగులుతున్నాయి.
ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు
సోషల్ మీడియా స్పందన
ఈ పోస్ట్ ఆన్లైన్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఇతర ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేసుకునే ముందు, ముందుగా తమ అప్పులను తీర్చుకోవడంపై దృష్టి పెట్టాలని చాలా మంది నెటిజన్లు సూచించారు.
ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!
ఖర్చులు కాదు బాబూ, మీ లోన్లే మీకు అసలు సమస్య: కనీసం పెర్సనల్ లోన్ అయినా తీర్చేంత వరకైనా మీకీ కష్టాలు తప్పవు. మీ బైక్ రుణం పూర్తయ్యే వరకు 4 నెలలు వెయిట్ చేసి, ఆ తర్వాత, ఆ 12 వేల రూపాయల పెర్సనల్ లోన్ చెల్లించేయండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు. అంతేకాదు లోన్ తీసుకొని మరీ ఫోన్ తీసుకోవడం అవసరమా, 3-4 నెలల పాటు వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకుని ఉంటే, ఫోన్ కోసం 20వేలు మిగిలేవి కదా అంటే ఇంకొకరు లెక్కలు చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్
అంటే ఈ జంట తమ సంపాదనలో సగానికి పైగా (50.5%) కేవలం అప్పులు తీర్చడానికే ఉపయోగిస్తున్నారు. ఆర్థిక సూత్రాల ప్రకారం ఈఎంఐలు ఆదాయంలో 30-35 శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అలాగే అనవరమైన వ్యక్తిగత అవసరాలను కొన్ని త్యాగం చేసి అత్యవసర ఖర్చులకోసం, ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ దాచుకోవడం కుటుంబాలకు చాలా అవసరం.ఏమంటారు?


