ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

NCP Chief Sharad Pawar Admitted To Mumbai Hospital - Sakshi

ముంబై: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్‌ పవార్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించటంతో ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా పవార్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేసింది ఎన్‌సీపీ. కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది.  

ప్రస్తుతం బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరద్‌ పవార్‌ నవంబర్‌ 2న డిఛార్జి కానున్నారని పార్టీ తెలిపింది. నవంబర్‌ 4 నుంచి 5 వరకు రెండు రోజుల పాటు శిరిడిలో నిర్వహించ తలపెట్టిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top