
భారత్లో తొలి మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసు నమోదైందనే వార్తలు కలకలం రేపుతుంది. ఆ వార్తలపై కేంద్రం స్పందించింది. ఇటీవల విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన ఓ వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆ వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మంకీ పాక్స్ వైరస్ లక్షణాలు అతనిలో ఉన్నాయా? లేవా అని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొంది.
Suspected #Mpox case under investigation; patient put under isolation, no cause for alarm
A young male patient, who recently travelled from a country currently experiencing Mpox (monkeypox) transmission, has been identified as a suspect case of Mpox. The patient has been…— PIB India (@PIB_India) September 8, 2024
ఏర్పాటు చేసిన ప్రోటోకాల్లకు అనుగుణంగా సదరు వ్యక్తిపై పరీక్షలు జరుగుతున్నాయని, వైరస్ మూలాలను గుర్తించడానికి, కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతుందని చెప్పింది. ఎంపాక్స్ విషయంలో అనవసర ఆందోళన చెందవద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.