కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌తో ఏపీ పరిశ్రమల మంత్రి భేటీ

Minister Mekapati Goutham Reddy Meets Union Power Minister RK Singh - Sakshi

న్యూఢిల్లీ: ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 'రాష్ట్రంలో సోలార్ ప్యానెల్ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు.

మన్నవరం, కొప్పర్తి పారిశ్రామికవాడలో సోలార్ ప్యానెల్ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. కోల్ ఇండియా, పవర్ మినిస్ట్రీ సహకారంతో 3 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఈ పరిశ్రమలకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనిని కేంద్రమంత్రికి తెలిపినట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

చదవండి: (ఆర్‌బీఐ నూతన పథకాలను ప్రారంభించిన ప్రధాని మోదీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top