రైతు ఉద్యమానికి కేసీఆర్‌ మద్దతివ్వాలి

Julakanti Ranga Reddy Demands KCR To Support Farmers Protest - Sakshi

మాజీ ఎమ్మెల్యే జూలకంటి డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా మద్దతివ్వాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. జూలకంటి, తెలంగాణలోని సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, సీఐటీయూ, విద్యార్థి యువజన సం ఘాల నేతృత్వంలో వందలాది మంది ఆదివారం ఆందో ళన శిబిరాలను సందర్శించారు.

టీఎస్‌ యూటీఎఫ్‌ రూ.3లక్షల ఆర్థిక సాయం
రైతు ఉద్యమానికి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌ యూటీఎఫ్‌).. రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేసింది. యూటీఎఫ్‌ ప్రతి నిధులు రైతు శిబిరాలను ఆదివారం సందర్శించారు. (చదవండి: పంతం వీడండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top