జవహర్‌లాల్‌ నెహ్రూ స్కాలర్‌షిప్స్‌ | Jawaharlal Nehru Memorial Fund Scholarship 2021: Full Details in Telugu | Sakshi
Sakshi News home page

జవహర్‌లాల్‌ నెహ్రూ స్కాలర్‌షిప్స్‌

Mar 30 2021 2:39 PM | Updated on Mar 30 2021 2:42 PM

Jawaharlal Nehru Memorial Fund Scholarship 2021: Full Details in Telugu - Sakshi

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఫండ్..  విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఫండ్‌ (జేఎన్‌ఎంఎఫ్‌).. డాక్టోరల్‌ స్టడీస్‌ చదివే దేశానికి చెందిన వారితోపాటు, ఇతర ఆసియా దేశాల విద్యార్థులకు జవహర్‌లాల్‌ నెహ్రూ ఉపకార వేతనాలు అందించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

► పీహెచ్‌డీ చదివే విద్యార్థులకు జవహర్‌లాల్‌ నెహ్రూ స్కాలర్‌షిప్స్‌:
► స్కాలర్‌షిప్‌ అందించే సమయం: రెండేళ్లు.

పీహెచ్‌డీ విభాగాలు: ఇండియన్‌ హిస్టరీ అండ్‌ సివిలైజేషన్, సోషియాలజీ, కంపెరేటివ్‌ స్టడీస్‌ ఇన్‌ రిలీజియన్‌ అండ్‌ కల్చర్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిలాసఫీ, ఎకాలజీ–ఇన్విరాన్‌మెంట్‌. వీటిలో ఏదో ఒక స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ చేసే అభ్యర్థులకు ఉపకార వేతనం లభిస్తోంది.

అర్హత: కనీసం 60శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఫుల్‌టైం పీహెచ్‌డీ స్కాలర్‌ అయి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఫండ్, తీన్‌మూర్తీ హౌస్, న్యూఢిల్లీ–110011 చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021
► వెబ్‌సైట్‌: jnmf.in

చదవండి: 
JEE Advanced 2021: అడ్వాన్స్‌డ్‌లో విజయం ఇలా..!

సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement