రైల్వే ఛార్జీల పెంపు.. 26 నుంచే కొత్త రేట్లు | Indian Railways Increased Fares Check new rates | Sakshi
Sakshi News home page

రైల్వే ఛార్జీల పెంపు.. 26 నుంచే కొత్త రేట్లు

Dec 21 2025 2:03 PM | Updated on Dec 21 2025 3:51 PM

Indian Railways Increased Fares Check new rates

భారతీయ రైల్వేస్‌ కీలక ప్రకటన చేసింది. టికెట్‌ ధరలను పెంచుతున్నట్లు పేర్కొంది. పెరిగిన ఛార్జీలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజాగా పెంచిన రేట్ల ప్రకారం.. లోకల్‌, స్వల్ప దూర ప్రయాణాల టికెట్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే..

అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే.. ఆర్డినరీ క్లాస్‌ రైలు టికెట్‌ ధర కిలోమీటరకు 1 పైసా చొప్పన పెంచింది. మెయిల్/ఎక్స్‌ప్రెస్‌ ఏసీ, నాన్‌-ఏసీ రైళ్లలో కిలోమీటరకు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్‌-ఏసీ ట్రైన్‌లో 500 కి.మీ దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్‌ చేస్తూనే.. ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

చివరిసారి రైల్వే ఛార్జీల పెంపు 2025 జూలైలో జరిగింది. ఆ పెంపుతో రైల్వేకు సుమారు రూ.700 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. తాజా పెంపుతో దాదాపు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement