న్యూఢిల్లీ: భారత్లో వరుసగా ఐదో రోజు 45 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో 49,931 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. అలాగే 708 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దేశంలో మొత్తం కేసులు 14,35,453కు, మరణాలు 32,771కు చేరాయని కేంద్రం సోమవారం ప్రకటించింది. 9,17,567 మంది బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 4,85,114. రికవరీ రేటు 63.92 శాతానికి చేరింది. కాగా, కరోనా వైరస్ నివారణకు బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అస్ట్రాజెనెకా సంస్థ కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ను భారత్లో త్వరలో 5 చోట్ల వేలాది మందిపై ప్రయోగించనుంది.
భారత్కు ఇజ్రాయెల్ బృందం రాక
కేవలం 30 సెకండ్లలో ఫలితాన్ని వెల్లడించే ర్యాపిడ్ కరోనా టెస్టింగ్ కిట్ అభివృద్ధికి ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇందుకోసం ఇజ్రాయెల్ రక్షణ శాఖకు చెందిన ఆర్అండ్డీ శాస్త్రవేత్తల బృందం ప్రత్యేక విమానంలో సోమవారం భారత్కు చేరుకుంది. అత్యాధునిక వైద్య పరికరాలను వెంట తీసుకొచ్చింది. నిజానికి ఈ పరికరాలను ఇజ్రాయెల్ నుంచి ఎగుమతి చేయడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ ప్రత్యేక అనుమతితో భారత్కు తరలిం చారు. టెస్టింగ్ కిట్ అభివృద్ధి విషయంలో ఈ బృందం భారత్ చీఫ్ సైంటిస్టు కె.విజయ్ రాఘవన్, డీఆర్డీవోతో కలిసి పనిచేయనుంది. ఈ టెస్టింగ్ కిట్ అందుబాటులో వస్తే అది కరోనాపై పోరులో కీలక మలుపు అవుతుందని ఇజ్రాయెల్ రాయబారి రోన్ మాల్కా పేర్కొన్నారు. కరోనాపై కలిసి పోరాడుదామని భారత్, ఇజ్రాయెల్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
14 లక్షలు దాటేశాయ్..!
Published Tue, Jul 28 2020 4:50 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement