Video: కోర్టులో జడ్జితో గొడవ.. లాయర్లను తరిమిన పోలీసులు | Ghaziabad Court Chaos After Judge vs Lawyer Cops Chase Away Advocates | Sakshi
Sakshi News home page

కోర్టులో కొట్టుకున్న లాయర్లు, జడ్జి.. న్యాయవాదులను పరుగెత్తించిన పోలీసులు

Oct 29 2024 3:56 PM | Updated on Oct 29 2024 4:35 PM

Ghaziabad Court Chaos After Judge vs Lawyer Cops Chase Away Advocates

ఘ‌జియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘ‌జియాబాద్ జిల్లా కోర్టులో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కేసు విచారణ సమయంలో జడ్జికి, ఓ న్యాయవాదికి మధ్య వివాదం తలతెత్తడంతో కోర్టు రణరంగంగా మారింది.  చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. కోర్టులో గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఘజియాబాద్‌ జిల్లా కోర్టులో ఓ బెయిల్ పిటీష‌న్ విష‌యంలో.. జడ్జితో, లాయర్‌ మ‌ధ్య వాగ్వాదం జరిగింది. ఇది చివరకు గొడవకు దారితీసింది. వెంటనే భారీ సంఖ్యలో లాయర్లు జ‌డ్జీ ఛాంబ‌ర్ వ‌ద్ద గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళ‌న చేప‌ట్టిన అడ్వ‌కేట్ల‌ను త‌రిమేందుకు పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. ప‌రిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు.  కూర్చీలు పట్టుకొని మ‌రీ లాయ‌ర్లను బయటకు త‌రిమేశారు. ఆ త‌ర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారామిలిట‌రీ ద‌ళాలు కూడా కోర్టు ఆవ‌ర‌ణ‌కు చేరుకున్నాయి.

ఈ ఘటనలో పలువురు న్యాయవాదులకు గాయాలైనట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ వివాదంపై చర్చించేందుకు బార్‌ అసోసియేషన్‌ సమావేశానికి పిలపునిచ్చింది. తమను జడ్జి ఛాంబర్ నుంచి బయటకు గెంటేసిన తరువాత న్యాయవాదులంతా కోర్టు బయట ధర్నా చేపట్టారు. జడ్జికి, సెక్యూరిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement